ఇక ఫై విజయ్ దేవరకొండ తో గొడవలు ఉండవు – అనసూయ

విజయ్ దేవరకొండ – అనసూయల మధ్య వార్ గత కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సమయం నుండి మొన్నటి ఖుషి పోస్టర్ వరకు అనసూయ ..విజయ్ సినిమా లపై తన కామెంట్స్ ను తెలియజేస్తూ వస్తుంది. ఈ క్రమంలో అనసూయ ఫై విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ..సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇకపై విజయ్ తో గొడవలు ఉండవని అనసూయ తేల్చి చెప్పింది.

విమానం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో వివాదాలకు ముగింపు పలుకుతున్నట్లు అనసూయ చెప్పుకొచ్చింది. గతంలో తాను విజయ్ తో మాట్లాడడానికి చాలా ట్రై చేశానని, కానీ అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పింది. అంతేకాకుండా త‌న‌పై కొంద‌రు డ‌బ్బులిచ్చి మ‌రీ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తున్నార‌ని, ఈ విష‌యం తెలిసి చాలా బాధ‌ప‌డ్డాన‌ని అనసూయ పేర్కొంది. అంతేకాకుండా తనకు పీఆర్ టీమ్ లేదని, ఏదైనా తనే మాట్లాడుతానని చెప్పింది. ఇక ట్విట్లు కూడా తనే చేశానని, ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనూసయ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.