ఆరో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్‌లో పెట్రోలు లీటరుకి రూ.84.94…డీజిల్ ధర 80.17 రూపాయలు

Rising petrol prices again
petrol price

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా ధరల్లో దాదాపు 10 పైసల పెరుగుదల కనిపించింది. ఈ రోజు పెట్రోల్ ధర హైదరాబాద్‌లో 84.94 రూపాయలకు చేరగా, డీజిల్ ధర 80.17 రూపాయలకు చేరింది. ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ.81.73, డీజిల్ రూ.73.56, ముంబైలో పెట్రోల్ ధర రూ.88.39, డీజిల్ ధర రూ.80.11, చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 84.73, డీజిల్ ధర రూ.78.86, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.83.24, డీజిల్ ధర రూ.77.06, బెంగళూరులో పెట్రోలు 84.39 రూపాయలు ఉండగా, డీజిల్ 77.88 రూపాయలుగా ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/