మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ రోజు జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి నిరంజన్ విజ్ఞప్తి చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/