తెలంగాణలో 2,384 కరోనా పాజిటివ్స్
మరణించిన వారి సంఖ్య 755
Hyderabad: తెలంగాణాలో గడిచిన 24 గంటలలో 2384 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 4వేల 249 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 11మంది మృతి చెందారు.
దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 755 కి చేరింది. ఇవాళ 1851 మంది వైరస్ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 80,586 మంది డిశ్చార్జి అయ్యారు.
నేటితో 22,386 కేసులు యాక్టీవ్ లో ఉండగా..వారిలో ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 15,931 మంది చికిత్స పొందుతున్నారు…
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో 40,666 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 9,31,839మందికి టెస్టులు జరిగాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/