కేంద్ర పనితీరు ఫై మరోసారి మంత్రి కేటీఆర్ ఆగ్రహం

కేంద్రం ఫై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వస్తున్న బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్..మరోసారి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉప్ప‌ల్ ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై ఓ నెటిజ‌న్ ట్వీట్ చేస్తూ.. కేటీఆర్‌కు ట్యాగ్ చేయ‌గా, ఆయ‌న కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గానే స్పందించారు.

ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట ఫ్లై ఓవ‌ర్ల ప‌నులు దుర‌దృష్టావ‌శాత్తు నేష‌న‌ల్ హైవేస్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్నాయి. ఈ రెండు ఫ్లై ఓవ‌ర్ల‌కు జీహెచ్ఎంసీ భూములు కేటాయించిన‌ప్ప‌టికీ ప‌నులు న‌త్త‌న‌డ‌కన కొన‌సాగుతున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో, జీహెచ్ఎంసీ ద్వారా ఎస్ఆర్డీపీ కింద 35 ప్రాజెక్టులు చేప‌ట్టి.. అనతి కాలంలోనే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామ‌న్నారు. కానీ కేంద్రం చేప‌ట్టిన రెండు ప‌నులు మాత్రం పూర్తి కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి, మోడీ ప్ర‌భుత్వానికి ఉన్న తేడా ఇదేన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.