బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారుః కెటిఆర్

పార్లమెంట్ లో సిఎం కెసిఆర్ ను అవమానించిన బండి సంజయ్

minister-ktr-fires-on-bandi-sanjay-comments-in-parliment

హైదరాబాద్‌ః ‘‘ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును అవమానించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.. మరి తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించిన బండి సంజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?.. ఆయనపై మేమేం చర్యలు తీసుకోవాలి’’ అంటూ మంత్రి కెటిఆర్ మోడీ సర్కారును ప్రశ్నించారు. పార్లమెంట్ లో కెసిఆర్ ను అవమానిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా ఏం చర్యలు తీసుకోబోతున్నారని నిలదీశారు.

దొంగల అందరి ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉంటుందంటూ రాహుల్ గాంధీ గతంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి నేతల ఫిర్యాదుతో రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. హైకోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈమేరకు మంత్రి కెటిఆర్ ఓ ట్వీట్ చేశారు. దీంతోపాటు బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. బండి సంజయ్ పై కెటిఆర్ ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుందని, తాము ఏం చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.