తెలంగాణ దేశంలో అగ్ర‌గామిగా రూపుదాల్చింది : మంత్రి హ‌రీశ్ రావు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రారంభ‌మ‌యింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. 2022-23 వార్షిక బడ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 2,56,958.51 కోట్ల‌తో హ‌రీశ్‌రావు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు కాగా, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు. రాష్ట్రం ఆవిర్భవించిన అన‌తికాలంలో అద్భుత ప్ర‌గ‌తి సాధించామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. సీఎం ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ప్ర‌గ‌తి ప‌థంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ప‌రిపాల‌న‌లో రాజీలేని వైఖ‌రిని టీఆర్ఎస్ అవ‌లంభించింది. కరెంట్ కోత‌లు, ఆక‌లి చావులు ఇప్పుడు లేవు అని స్ప‌ష్టం చేశారు. స‌వాళ్లు, క్లిష్ట‌మైన స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాం. ప‌రిపాల‌న‌లో టీఆర్ ఎస్ రాజీలేని వైఖ‌రిని అవ‌లంభించింద‌న్నారు.

ఆఫీసుల చుట్టూ కాళ్ల‌రిగేలా తిర‌గాల్సిన ప‌నిలేదు..ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా న‌గ‌దు బ‌దిలీ..ఆస‌రా, రైతు బంధు ఇలా ఏ ప‌థ‌క‌మైనా ల‌బ్ధి దారుల‌కు చేరుతుంద‌న్నారు. డ‌బ్బులు జ‌మ‌కాగానే ఫోన్లు టింగుమంటూ మోగుతున్నాయి. ఇదే స‌భ‌లో ఒక‌ప్పుడు పేగులు తెగేదాక కొట్లాడాం.. తెలంగాణ దేశంలో అగ్ర‌గామిగా రూపుదాల్చింది. స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు ప‌డింద‌న్నారు. రాష్ట్ర పున‌ర్ నిర్మాణ బాధ్య‌త‌ను సీఎం కేసీఆర్ త‌న భుజాల‌పై వేసుకున్నారు. పోరాట ద‌శ‌నుంచి ఆవిర్భావం వ‌ర‌కు తెలంగాణ కొత్త రూపం సంత‌రించుకుంద‌న్నారు. తెలంగాణ దేశంలోనే అగ్ర‌గామిగా రూపు దాల్చింద‌న్నారు. రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెడుతోంద‌ని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/