అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై నేడు కీలక నిర్ణయం

నేడు టీడీఎల్పీ సమావేశం

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై శాసనసభ పక్షం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 7 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలకు హాజరు కావాలా? వద్ద అన్నఅంశంపై అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. చట్ట సభలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. గత సమావేశాల్లో జరిగిన అవమానానికి కలత చెంది అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు బాహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరుపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. దీంతో నేడు జుమ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగే భేటీలో టీడీఎల్పీ తుది నిర్ణయం తీసుకోనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/