కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బొత్స..పార్టీ లో ఉంటే ఉండండి.. పోతే పొండి

మంత్రి బొత్స సత్యనారాయణ సొంత పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మా సమస్యలు పట్టించుకోండి మంత్రి గారు అని ఒక్కసారిగా అడిగేసరికి మంత్రికి కోపం వచ్చింది. అంతే యూజ్ లెస్.ఫెల్స్.. పార్టీలో ఉంటే ఉండండి. పోతే పొండి..అంటూ మండిపడ్డారు. మంత్రి ఆ మాటలు అనేసరికి కార్యకర్తలకు ఎక్కడలేని కోపం వచ్చింది.

రీసెంట్ గా విజయనగరంలో స్థానిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి బొత్స వచ్చి , ఆ తరువాత తన కారులో బయలుదేరుతుండగా.. ఎస్‌కోట టౌన్ అధ్యక్షుడు ఆయనను కలిశారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి బొత్స అసహనానికి గురయ్యారు. కార్యకర్తల్లో క్రమశిక్షణా రాహిత్యం పెరిగిందని మండిపడ్డారు. ‘‘ఏందయ్యా మీ బాధ, మీకేనా బాధలు..మాకు లేవా? కార్యకర్తలు అంటే ఇలానే ఉంటారా? బాధలు అందరికీ ఉంటాయి. సమయం సందర్భం ఉండక్కర్లేదా? పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి ఆ మాటలు అనేసరికి కోపంతో కార్యకర్తలు అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ విషయం స్థానికంగా చర్చ గా మారింది. రాబోయే ఎన్నికల్లో వీరికి సరైన బుద్ది చెప్పాలంటూ అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.