వెండి ఇటుకలతో ఆయోధ్య భూమి పూజ
మూల విరాట్టు కింద 40 కేజీల వెండి ఇటుక
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోడి శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. అయితే అయోధ్య నగర వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా భక్తుల భూమి పూజను వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఈ సందర్భంగా మాట్లడుతూ..అయిదు వెండి ఇటుకలతో భూమి పూజ నిర్వహించనన్నట్లు తెలిపారు. ప్రధాన కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచి వేద శాస్త్రాలను అనుసరించి క్రతువులు ఉంటాయని చెప్పారు. కార్యక్రమానికి ప్రధాని మోడిని ఆహ్వానించామని తెలిపారు. అయితే ఆయన ఏ రోజు వస్తారనే విషయాన్ని ప్రధాని కార్యాలయం ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. కాకపోతే, 5వ తేదీని ఆయన వస్తున్నట్టు తమకు సమాచారం ఉందని తెలిపారు.
అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న సీనియర్ బిజెపి నేతలందరినీ ఆహ్వానించామని ట్రస్ట్ తెలిపింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, సాధ్వి రీతంభర తదితరులంతా ఈ జాబితాలో ఉన్నారని వెల్లడించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/