అంజూ యాదవ్‌పై పవన్ ఫిర్యాదు చేయడం పట్ల మంత్రి అంబటి సెటైర్లు

జనసేన పార్టీ కార్యకర్త సాయి ఫై శ్రీకాళహస్తి CI అంజు యాదవ్ చేయిచేసుకోవడం ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కార్యకర్త ఫై దాడికి పాల్పడడం ఏంటి అని ప్రశ్నించిన పవన్..సోమవారం తిరుపతి SP కి అంజు యాదవ్ ఫై పిర్యాదు చేసారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఆయుధాలు లేకుండా, శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు. అంజూ యాదవ్ ప్రవర్తన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

తమ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టారని తెలిపారు. కానీ సీఐ రాజ్యాంగ విరుద్ధంగా సాయిని కొట్టారని అన్నారు. పోలీసులకు ప్రభుత్వం నుంచి ఓత్తిడి ఉంటుందని, దాన్ని ఒక స్థాయి వరకు అర్థం చేసుకుంటామని చెప్పారు. సుమోటోగా కేసు తీసుకున్న మానవ హక్కుల సంఘానికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అయితే పవన్ పిర్యాదు ఫై మంత్రి అంబటి రాంబాబు సైటైర్లు వేశారు.

‘ముద్రగడ సతీమణి అప్పటి పోలీసులు హింసిస్తే నోరు మూసుకున్న పెద్దమనిషి… అంజూ యాదవ్ పై కంప్లైంట్ ఇవ్వడానికి తిరుపతి వెళ్ళాడు… వారెవ్వా!’ అని ట్విట్ చేశారు.