రేపు విజయవాడ లో ‘వ్యూహం జనగర్జన’ ప్రీ రిలీజ్

వివాదాస్పద చిత్రాలకు , ట్వీట్స్ కు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..తాజాగా వ్యూహం అనే కొత్త చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించారు. ఇది రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ముందుగా ‘వ్యూహం’ పేరుతో మొదటి పార్ట్ ను ఈ నెల 29 న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటీకే ఈ చిత్ర ట్రైలర్ , పోస్టర్స్ , సినిమా తాలూకా విశేషాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..రేపు ‘వ్యూహం జనగర్జన’ పేరిట విజయవాడ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కు చంద్రబాబు, పవన్, లోకేష్ లను ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ ఆహ్వానం పలికినట్లు తెలిపారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైసీపీ నాయకులు ఎమ్మెల్యే లు రాబోతున్నారని , వ్యూహం రాజకీయ వ్యూహం కోసం తీయలేదని, వేరే వాళ్ళ మీద వ్యూహం తీసాం కానీ మా మీద మాకు వ్యూహం లేదని చెప్పుకొచ్చారు . చంద్రబాబు అరెస్ట్, వివేకా హత్య వంటి సన్నివేశాలు ఇందులో ఉంటాయన్నారు. అలాగే ఈ మూవీ లో చంద్రబాబు, పవన్, చిరంజీవి , షర్మిల, సోనియా, రాహుల్ పాత్రలు ఉంటాయని స్పష్టం చేసి మరింత క్రేజ్ పెంచారు. ఇక జనవరి నెలలో వ్యూహం కి కొనసాగింపు గా “శపథం ” రిలీజ్ చేస్తున్నామన్నారు.