ఊటిలో కూలిన ఆర్మీ హెలికాప్టర్..
తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు.
ప్రమాద సమయంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య, డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు మరణించినట్లు అనధికారిక వర్గాల నుంచి సమాచారం. సూలూర్ వైమానిక స్థావరం నుంచి డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి(డీఎస్సీ) వెళ్తుండగా వెల్లింగ్టన్ వద్ద కుప్పకూలింది. 80 శాతానికిపైగా కాలిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.