భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం..నాలుగు వాహనాలు ఒకదానినొకటి ఢీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు లారీలు, ఒక అశోక్‌ లే ల్యాండ్‌ వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. రోడ్డుపై ఆపిన లారీని వెనకనుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది.

దీంతో ఆ లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కున్నాడు. అతన్ని రక్షించేందుకు మరో లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి అటువైపుకు వెళ్లాడు. వెంటనే నిలిపి ఉన్న ఆ లారీని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు చెలరేగాయి. మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.