ఈ నెల 20న కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బలం రోజు రోజుకు పెరుగుతుంది. కర్ణాటక లో కాంగ్రెస్ విజయం సాధించడం తో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇలాగే మిగతా రాష్ట్రాల్లోనూ విజయం సాధించాలని చూస్తుంది. ముఖ్యముగా తెలంగాణ లో కాంగ్రెస్ గెలిచి తీరాలని తీవ్రంగాకష్ట పడుతుంది. అలాగే మిగతా పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రీసెంట్ గా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరగా..ఈ నెల 20 న జూపల్లి తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ముగ్గురు మహిళా జడ్పీ చైర్‌పర్సన్ లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ తీగల అనిత రెడ్డి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మందుల సామెల్, రామారావు పటేల్, కోదాడకు చెందిన శశిధర్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి ఆహ్వానించనున్నారు.