లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 302 పాయింట్ల లాభంతో 67,097కు చేరుకుంది. చరిత్రలో తొలిసారి 67 వేల పాయింట్లకు పైన ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 19,833కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డారులతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.09 వద్ద కొనసాగుతుంది.