ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లోని ప్రధాన మార్కెట్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. దాదాపు 22 అగ్నిమాపక యంత్రాలు.. మంటలు అదుపులోకి తెచ్చారు. మరికొందరు గాయాలు పాలైనట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS)కి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ సాయంత్రం 5.25 గంటలకు కాల్ వచ్చిందని చెప్పారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చామని, కూలింగ్ ఆఫ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని పేర్కొన్నారు.