గురుగ్రామ్ జిల్లాలో అగ్నికి ఆహుతైన ఏపీకి చెందిన బస్సు..ఇద్దరు మృతి

హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఏపీకి చెందిన స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. ఢిల్లీ-జైపూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి క్రైమ్ టీమ్ చేరుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రలు.. ఐదుగురు మేదాంతలో, ఆరుగురు సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనతో ఢిల్లీ జైపూర్ హైవేపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీకి చెందిన ఈ బస్సు గురుగ్రామ్‌లోని సెక్టార్‌-12 నుంచి మీర్‌పూర్‌కు వెళ్తుంది. మృతి చెందిన వారిలో వృద్ధురాలు, యువతి ఉన్నట్లు సమాచారం. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి సంబదించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.