పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలు అయ్యాయి. పట్టాలు తప్పి ప్లాట్‌ ఫాడ్ సైడ్‌ వాల్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మూడు ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టి రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం.

ఒక్కసారి రైలు కుదుపునకు గురికావడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి పండగా వేళ ఈ ప్రమాదం జరగడం తో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. గత కొద్దీ నెలలుగా వరుస గా రైలు ప్రమాదాలు జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వారంలో ఎక్కడో ఓ చోట రైలు ప్రమాద ఘటన వార్తల్లో నిలుస్తుంది.