దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

Stock markets ended with gains
markets-ends-in-profits

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అంతకంతకూ పెరుగుతూనే పోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 63,416కి చేరుకుంది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 18,817 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డారులతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.02 వద్ద కొనసాగుతుంది.