లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్లు లాభపడి 65,216కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 19,393కి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.11 వద్ద కొనసాగుతుంది.