కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. ఈ ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాలను కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 878 పాయింట్లు కోల్పోయి 61,799కి పడిపోయింది. నిఫ్టీ 245 పాయింట్లు నష్టపోయి 18,414కి దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.72 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/