“స్వాగతం, బడ్డీ”: చంద్రయాన్-3 ల్యాండర్ నుండి ప్రత్యేక సందేశం
బెంగుళూరు: చంద్రయాన్-3 మిషన్లో భాగంగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ దాదాపు చంద్రుడి ఉపరితలానికి చేరుకున్నది. ఎల్లుండి సాయంత్రం చందమామపై ఆ ల్యాండర్ దిగే ఛాన్సు ఉంది. అయితే చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్ .. విక్రమ్కు వెల్కమ్ చెప్పింది. ఇస్రో తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. వెల్కమ్ బడ్డీ అంటూ ఆ మెసేజ్లో పోస్టు చేశారు. చంద్రయాన్-2 ఆర్బిటార్, చంద్రయాన్-3 ల్యాండర్తో టూ వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు ఇస్రో తెలిపింది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్రమ్ ల్యాండింగ్పై లైవ్ టెలికాస్ట్ ఉంటుందని ఇస్రో వెల్లడించింది.