స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 205 పాయింట్లు లాభపడి 66,795కి చేరుకుంది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 19,749 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఒకానొక దశలో 67 వేల మార్క్ ను టచ్ చేసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.04 వద్ద కొనసాగుతుంది.