తొలిసారి 70 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్

sensex-crosses-70000-mark-first-time-in-history

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డును సృష్టించాయి. చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 70 వేల మార్కును అధిగమించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 70,083 పాయింట్లకు పెరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 69,929కి చేరుకుంది. నిఫ్టీ 28 పాయింట్లు పుంజుకుని 20,997 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 వద్ద కొనసాగుతుంది.