లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎనిమిది రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు చివరి వరకు అదే జోరును ప్రదర్శించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 449 పాయింట్లు లాభపడి 59,411కి పెరిగింది. నిఫ్టీ 147 పాయింట్లు పుంజుకుని 17,451కి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువు రూ. 82.50 వద్ద కొనసాగుతుంది.