తండ్రిలా చూసుకుంటానని చెప్పి..చివరకు అత్యాచారం చేసాడు

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరుసలు మరచిపోయి అమాయకపు బాలికల ఫై , ఒంటరి మహిళలపై అఘాత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రిలా చూసుకుంటానని చెప్పిన వ్యక్తి..చివరకు ఆ బిడ్డపైనే అత్యాచారం చేసాడు.

వివరాల్లోకి వెళ్తే..

మహబూబాబాద్ జిల్లాకు చెందిన సదరు మహిళా..భర్త తో దూరంగా ఉంటూ తన కొడుకు (17) , కూతురు (15)ను తీసుకొని బంజారాహిల్స్ నంబరు 14 సమీపంలో నివాసం ఉంటుంది. వారి సొంత ఉరుకు చెందిన బేతమాల కృష్ణ(35) సెంట్రింగ్‌ పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. అతడి తో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కూతురి కి తండ్రిలా ఉంటానని చెప్పి..మహిళకు దగ్గరయ్యాడు. కూతుర్ని , కొడుకును బాగా చూసుకోవడం తో సదరు మహిళా కూడా అతడ్ని బాగా నమ్మింది. బోనాల పండుగ నేపథ్యంలో తన కూతురిని మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పంపింది. ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి కూతురితో తేడాలు కనిపిస్తుండడం తల్లి గమనించి ఏంజరిగిందా అని ఆరా తీసింది.

ఈ నెల ఏడో తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లికి చెప్పింది. వెంటనే కృష్ణ ఫై ఆ తల్లికి పీకల్లోతు కోపం వచ్చింది. తండ్రిలా ఉంటానని నమ్మించి నా బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడతావా? అంటూ ఆమె కృష్ణను నిలదీసింది. దాంతో అతడు పరారయ్యాడు. ఎంత వెతికిన అతడి ఆచూకీ దొరకకపోవడం తో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అతడి ఫై పిర్యాదు చేసింది.