లంగర్ హౌస్ పీఎస్​ పరిధిలో దారుణం..

లంగర్ హౌస్ పీఎస్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపి , ముక్కలుగా చేసి దర్గా దగ్గర పడేసారు. ఈ ఘటన ఫై పోలీసులు స్పందించారు. గురువారం రాత్రి 10:30 గంటల తర్వాత దర్గా మిలట్రీ హాస్పిటల్​ సమీపంలో ఓ ఆటో నుండి ఓ వ్యక్తి, ఓ మహిళ దిగి , గోనె సంచి తెచ్చి పడేస్తుండగా, స్థానికులు గమనించి ఏమిటి అని అడిగినట్లు తెలిపారు. స్థానికులు ఎంత అడిగినా..వారు
సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా గోనె సంచిలో డెడ్​బాడీ ఉన్నట్లు గుర్తించారు. ముక్కలు, ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్​లో శరీర భాగాలను మూటగట్టినట్లు తెలిసింది. వెంటనే వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని, డెడ్​బాడీ ఎవరిదో, తెచ్చి పడేసింది ఎవరో అనే దానిపై విచారణ మొదలుపెట్టారు.