సమస్యలపై ఉభయ సభల్లో నిలదీయాలి
రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే
New Delhi: కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశంలో కాంగ్రెస్ నేత ,రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చలు జరిపామని అన్నారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చే పౌరులు, వైద్య విద్యార్థులకు సహాయం, రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలను పార్లమెంటు ఉభయ సభలో నిలదీయాలని నిర్ణయించామని తెలిపారు. పార్టీ అగ్ర నాయకత్వంలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/