కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
5 రాష్ట్రాల్లోఘోర పరాజయం పై అంతర్మథనం
New Delhi: ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ రెండో విడత సమావేశాలు, కాంగ్రెస్ పార్టీ పరాభవానికి గల కారణాలు.. పార్టీ సంస్థాగత ఎన్నికలు.. పార్టీలో అంతర్గతంగా విస్తరిస్తున్న అసంతృప్తిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అయితే, అంతకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రాఫ్ సమావేశం అయింది.
రేపటి నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ రెండో విడత సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. అధికార బీజేపీ పార్టీని ఎలా ఎదర్కోవాలనే దానిపై చర్చించనున్నారు. ఇందు కోసం సోనియా గాంధీ నివాసం 10 జన్పథ్లో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రాప్ సమావేశమైంది.. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె సురేష్, జైరాం రమేష్ తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/