మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని నేడు పార్ల‌మెంటులో ప్ర‌క‌ట‌న చేస్తార‌ని దేశం ఎదురుచూస్తోందిః ఖ‌ర్గే

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌పై మోడీవి త‌ప్పుడు ఆరోణ‌లు

Mallikarjun Kharge takes on PM Modi, says could have dismissed Manipur CM if he was really angry

న్యూఢిల్లీ: మ‌ణిపూర్‌లో మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ నిజంగానే తీవ్రంగా ప‌రిగ‌ణిస్తే తొలుత ఆయ‌న ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బీరేన్‌సింగ్‌ను తొలుత డిస్మ‌స్ చేయాల్సింద‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం మాని ముందు మ‌ణిపూర్ సీఎంను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని కోరారు.

మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని నేడు పార్ల‌మెంటులో ప్ర‌క‌ట‌న చేస్తార‌ని దేశం ఎదురుచూస్తోంద‌న్నారు. 80 రోజులుగా మ‌ణిపూర్ మండిపోతున్నా ప్ర‌భుత్వం నోరు మెద‌ప‌లేద‌ని, పూర్తి నిస్స‌హాయంగా ఉండిపోయింద‌ని, ఎలాంటి ప‌శ్చాత్తాపం చెంద‌లేద‌ని మండిప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో నేడు పార్ల‌మెంటులో ప్ర‌ధాని మోడీ దీనిపై ప్ర‌కట‌న చేస్తార‌ని దేశం మొత్తం ఆశిస్తోంద‌ని ట్వీట్ చేశారు. మోడీ నిజంగానే మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై బాధ‌ప‌డి ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు మాని బీరేన్ సింగ్‌ను డిస్మ‌స్ చేసి ఉండేవార‌న్నారు. మ‌రో ట్వీట్‌లో మోడీకి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ప్ర‌ధాని నేటితో 81వ వసంతంలోకి ప్ర‌వేశించారు.