మహరాష్ట్రలో లాక్‌డౌన్‌ పొడిగింపు

జూలై 31 వరకు పొడిగిస్తూ.. ఉత్తర్వులు

Maharashtra-Government-extends-lockdown

మంబయి: మహరాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా జూలై 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 86,575 మంది డిశ్చార్జి కాగా, 7,429 మంది మృతిచెందారు. ప్రస్తుతం 70,622 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/