జమ్ముకశ్మీర్లో 4.9 తీవ్రతతో భూకంపం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కాగా, జూన్ తర్వాత దోడా జిల్లాలో భూకంపం రావడం ఇది 12వ సారి. జూన్ 13న 5.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇండ్లు, భవనాలు బీటలువారాయి.