హైకోర్టులో లోకేశ్ రెండు లంచ్ మోషన్ పిటిషన్లు.. మధ్యాహ్నం విచారణ

రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు

Lokesh two lunch motion petitions in the High Court.. afternoon hearing

అమరావతిః ఏపీ హైకోర్టులో టిడిపి యువనేత నారా లోకేశ్ రెండు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో ఒక పిటిషన్ అమరావతి రింగ్ రోడ్డు కేసుకు సంబంధించినది. ఈ కేసులో తనకు సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసుల్లో కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. హెరిటేజ్ సంస్థకు చెందిన తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకురావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. వీటిని హైకోర్టులో లోకేశ్ సవాల్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానని… అలాంటప్పుడు వాటిని తానెలా తీసుకొస్తానని ఆయన పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది.