వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా సాయం విడుద‌ల‌

గుంటూరు జిల్లా తెనాలి లో వరుసగా నాలుగో ఏడాది మూడో విడ‌త వైయస్ఆర్ రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జ‌మ చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ జమ చేసారు. రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. వరు­సగా నాల్గో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ అందజేశారు.

ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంద‌ని అన్నారు. రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామ‌న్నారు. 2022 డిసెంబర్‌లో మాండూస్ తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతన్నలకూ రూ.76.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ మొత్తాన్ని రబీ సీజన్‌ ముగియక ముందే వారి ఖాతాల్లో జమచేస్తున్నామ‌న్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటివరకు 22.22 లక్షల మంది రైతన్నలకు రూ.1,911.78 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సి­డీని అందించామ‌న్నారు. ఇలా గడిచిన మూడేళ్ల తొమ్మిది నెలల్లో రైతులకు మొత్తం మీద నేరుగా రూ.1,45,751 కోట్ల లబ్ధిని చేకూర్చామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

అంతకుముందు గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్న జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. తెనాలి మార్కెట్ యార్డ్‌లో సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను జగన్ పరిశీలించారు.