హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయినా మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డి

మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డి హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటి నుండి మల్లారెడ్డి ఇంటి తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ బాధ్యతలను చూసుకుంటున్న ప్రవీణ్‌ రెడ్డి ఇంటిపై కూడా అధికారులు సోదాలు చేసారు. ఈ క్రమంలోనే ప్రవీణ్‌ రెడ్డి అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆయన్ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన బాగానే ఉండడం తో డాక్టర్స్ ఇంటికి పంపించారు.

మంత్రి మల్లారెడ్డి పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించి నిన్నటి నుండి సోదాలు చేపట్టారు. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో కూడా డైరెక్టర్‌గా మహేందర్‌ రెడ్డి ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గర్తించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫాం మెడోస్‌లో ఉంటున్న మహేందర్‌ రెడ్డి హౌస్‌లో అధికారులు దాడులు చేపట్టారు. అక్కడే పక్కనే నివాసం ఉంటున్న మల్లారెడ్డి మరో కుమారుడు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.