రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు…ఓటేసిన లోక్‌సభ స్పీకర్‌

lok-sabha-speaker-om-birla-cast-his-vote-in-rajasthan’s-kota

జైపూర్‌ః రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.