తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా
దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ తొలి జాబితాను శనివారం సాయంత్రం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ రిలీజ్ చేయగా… వారణాసి నుంచి ప్రధాని మోడీ మరోసారి పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుండి 9 మంది నేతలను ప్రకటించారు.
ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు అవకాశం కల్పించగా.. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, హైదరాబాద్ మాధవీలత, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ భరత్ ప్రసాద్, జహీరాబాద్ బీబీ పాటిల్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్రెడ్డికి అవకాశం కల్పించింది.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పని చేయనున్నట్లు వినోద్ తావ్డే పేర్కొన్నారు.