బ్రిడ్జి రోడ్డుపై చిరుత సంచారం

పట్టుకునే ప్రయత్నంలో తప్పించుకుని ఫంక్షన్ హాల్‌లోకి చిరుత..ఓ వ్యక్తికి గాయాలు

leopard-on-kattedan-road

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంపలోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై ఈరోజు ఉదయం చిరుత కనిపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే కాలికి గాయమై కదల్లేని స్థితిలో అది ఉన్నట్టు గుర్తించారు. సమాచారం తెలుసుకునన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. వచ్చీపోయే వాహనాలపై చిరుత దాడిచేసే అవకాశం ఉండడంతో రాకపోకలను నియంత్రించారు.

అనంతరం దానిని బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని సమీపంలోనే ఉన్న ఫంక్షన్ హాలుకు చేరుకుంది. తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తిని గాయపరిచింది. దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అది ఇంకా తప్పించుకుని తిరుగుతుండడంతో బంధించేందుకు అటవీ, జూపార్క్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/