సెల్ఫ్ క్వారంటైన్‌లోకి అమెరికా ఉపాధ్యక్షుడు

తన సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్

US Vice-President Mike Pence

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్ సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో మైక్‌ పెన్స్‌ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయనకు నిర్వహిస్తున్న పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వస్తున్నప్పటికీ, వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధానికే పెన్స్ మొగ్గు చూపారు. మరోవైపు, కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ఏర్పడిన బృందమే ఆ వైరస్ బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ బృందంలోని ఉన్నతస్థాయి శాస్త్రవేత్తలు ఇప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అలాగే, ఈ బృందంలోని సభ్యులైన అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాల డైరెక్టర్ రెడ్‌ఫీల్డ్, ఆహార, ఔషధ పరిపాలన విభాగం కమిషనర్ స్టీఫెన్ హాన్‌లు కూడా నిర్బంధంలోనే ఉన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/