భారత్లో గత 24 గంటలో 4,213 కొత్త కేసులు
గత 24 గంటల్లో భారత్లో 97 మంది మృతి ..మొత్తం మృతుల సంఖ్య 2,206
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ రోజూ నమోదుకానన్ని అత్యధిక కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 4,213 మందికి కొత్తగా కరోనా సోకింది. 24 గంటల్లో భారత్లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,206కి చేరింది. కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 67,152కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,917 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 44,029 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు విడుదల చేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/