నేడు సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు అన్ని రాష్ట్రల సిఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించానున్నారు. ఈ నెల 17తో మూడో దశ లాక్డౌన్ పూర్తి కాబోతోంది కాబట్టి ..అనంతరం తీసుకోవాల్సన చర్యలపై నేడు సమావేశం జరుగనుంది. ఈనేపథ్యలో మధ్యాహ్నం 3 గంటలకు ఈభేటి జరునుంది. కాగా లాక్డౌన్ లో కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చి… గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల వారీగా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్నది ప్రధాని రాష్ట్రాల సిఎంలు చెప్పిన దాన్ని బట్టీ… నెక్ట్స్ ఎలా ముందుకెళ్లాలో డిసైడ్ చేస్తారు. ఐతే… చాలా రాష్ట్రాలు లాక్డౌన్పై అసంతృప్తితో ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం అడ్డంగా పడిపోతోందని ఆందోళన చెందుతున్నాయి. పైగా కరోనా ఆగట్లేదు. అందువల్ల మీటింగ్లో లాక్డౌన్ అంతగా ఫలితం ఇవ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తారని తెలుస్తోంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/