మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ – ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఢిల్లీ లో కవిత ఆధ్వర్యంలో ఇతర రాజకీయ పార్టీలు, పౌర సామాజిక సంస్థలతో కలిసి రౌండ్‌ టేబుల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ తరుణంలో కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ తరుణంలో ఆమె మీడియా తో మాట్లాడుతూ…మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపేదాకా పోరాడతామని స్పష్టం చేశారు.

రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని.. కానీ అవి అమలు కావడం లేదని ఆమె అన్నారు. ‘ ఆకాశంలో సగం.. ధరణిలో సగం.. అవకాశంలో సగమని మహిళలకు సమానమైన స్థానం ఉండాలని మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో పోరాడుతున్నాం. మహిళా బిల్లు ఆమోదం కోసం మొన్న జంతర్‌మంతర్‌లో ధర్నా చేశాం. దీనికి కొనసాగింపుగా ఈరోజు రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నాం. ఇందులో అన్ని పార్టీలను పిలుచుకుని పార్లమెంటులో ఏం చేయాలనే దానిపై చర్చిస్తాం. వారి మద్దతు కూడా గడడతాం.. ఈ మీటింగ్‌కు రాని పార్టీలపై భవిష్యత్తులో ఒత్తిడి పెంచి కలిసివచ్చేలా చేస్తాం’ అని , ఈ బిల్లుపై కాంగ్రెస్ కూడా కలిసిరావాలని కోరినట్టు కవిత తెలిపారు.