నేడు సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా తంగళ్లపల్లి మండలం, జిల్లెల వ్యవసాయ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి.. నివాళ్లు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చిన్న తరహా కుటీర వ్యాపారం చేసుకునే 128 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అంజేయనున్నారు.

12:30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో పోడు భూముల పట్టాల పంపిణీ చేయనున్నారు.దాదాపు 1650 మంది లబ్ధిదారులకు కేటీఆర్ స్వయంగా పట్టాలు అందజేస్తారు. అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్ల బీఆర్ఎస్వీ యూత్ అధ్యక్షులు మనోజ్ తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో వారి నివాసానికి వెళ్లి మనోజ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.