కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై .. మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫై ..ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ సీతాఫల్మండి రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం మూడు ఎలివేటర్లను ప్రారంభించారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ లో నెటిజన్లు ‘లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ తీసుకురావాలని అడిగితే.. రైల్వే స్టేషన్లో లిఫ్టు తీసుకొచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
ఇదే విషయంపై స్పందించిన కేటీఆర్.. ‘సీతాఫల్ మండి రైల్వేస్టేషన్లో మూడు ఎలివేటర్లు ప్రారంభించడమే ఆయన నియోజకవర్గంలో ఈ బీజేపీ ఎంపీ అతిగొప్ప అచీవ్మెంట్. కేంద్రం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చిన కిషనన్నా వెల్డన్’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.