తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు..శిలాతోరణం వరకు క్యూ లైన్

నిండిపోయిన వైకుంఠం కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు

Devotees flocking to Tirumala in large numbers..Queue line up to Silathoranam

తిరుమలః విద్యార్థులకు ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్లు లేకుండా వచ్చినవారికి స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోగా… భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది.

కాలినడకన కొండపైకి వచ్చే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారికి 5-6 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది.