ఎన్నికల ప్రచారంలో రజనీకాంత్ డైలాగ్ తో అదరగొట్టిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు మరింత కాకరేపుతుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గల్లీ నేతల దగ్గరి నుండి ఢిల్లీ నేతల వరకు ప్రచారం చేస్తూ తమ పార్టీ కి మద్దతు పలుకుతున్నారు.

ఇక అధికార పార్టీ బిఆర్ఎస్ విషయానికి వస్తే..ముందు నుండి కూడా ప్రచారం ఫై మరింత ఫోకస్ పెట్టింది. వరుసగా సభలు , సమావేశాలు జరుపుతూనే..సోషల్ మీడియా తో పాటు మీడియా చానెల్స్ లలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో రోడ్ షో లతో ఆకట్టుకుంటున్నారు. ముందునుండి కేటీఆర్ మాటల్లో దిట్ట అనే సంగతి తెలిసిందే. ఏ భాషలో నైనా మాట్లాడుతూ అవతలి వ్యక్తిని ఆకట్టుకుంటుంటాడు. ఎన్నికల ప్రచారంలో కూడా అలాగే మాట్లాడుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నాడు. ప్రచారంలో రజనీకాంత్ డైలాగ్ వాడుతూ అదరగొట్టాడు. సింహం సింగిల్ గా వస్తుంది… పందులు గుంపులుగా వస్తాయని అన్నారు.

వికారాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ..సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే మళ్లీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ , వృద్ధులకు పింఛన్, వితంతులకు పింఛన్, వికలాంగులకు పింఛన్ మరెన్నో పథకాలు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తుంది అని అన్నారు. ఒక్క కేసీఆర్ ని ఢీకొట్టడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనుషులను తెచ్చకుంటున్నారన్నారు. అయినా సింహం సింగిల్ గా వస్తుంది… పందులు గుంపులుగా వస్తాయని అన్నారు.