లంచం అడిగిందని ఆరోపణ.. చెప్పుతో కొట్టిన అధికారిణి

Government employee hit a common man
Government employee hit a common man

హైదరాబాద్‌: లంచం అడిగిందని ఆరోపించడంతో ఓ ప్రభుత్వాధికారిణి ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. తన కాలికున్న చెప్పు తీసి విసిరింది, మరో చెప్పుతో ఆ వ్యక్తి చితకబాదింది. పూర్తి వివరాల్లోకెళితే..ఇంటి నిర్మాణం కోసం అనుమతి కావాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెందిన ఓ అధికారిణికి దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతులు ఇవ్వకుండా లంచం ఇవ్వాలని ఆమె వేధించింది. దీంతో న్యాయస్థానానికి వెళ్లి, అనుమతి కోసం ఆర్డర్లు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అధికారిణి నుంచి స్పందన లేకపోవడంతో అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అది తెలిసి ఇంటి నిర్మాణం పరిశీలించేందుకు అధికారులు వచ్చారు. అనుమతులు లేకుండా ఎందుకు నిర్మిస్తున్నావని ప్రశ్నించారు. అనుమతులు మంజూరు చేయాలని వారిని మరోసారి కోరాడు. అధికారిణి లంచం అడిగిందని అతడు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె.. నన్నే లంచం అడిగానని అంటావా? అంటూ చెప్పులతో బాధితుడిపై దాడి చేసింది. ఇంటి నిర్మాణ అనుమతి కోసం కంటోన్మెంట్ అధికారుల చుట్టూ మూడేళ్లుగా తిరిగానని బాధితుడు చెప్పాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/