భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీః కెటిఆర్
మన్మోహన్ సింగ్తో కలిసి భారత్ను గాడిన పెట్టేందుకు కృషి చేశారన్న మాజీ మంత్రి
హైదరాబాద్ః పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ… తెలుగువారికి… తెలంగాణవారికి… అలాగే భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నరసింహారావు అని అన్నారు. నాడు అప్పుల్లో కూరుకుపోయిన భారత్ను… మన్మోహన్ సింగ్తో కలిసి గాడిన పెట్టేందుకు కృషి చేశారన్నారు. దేశానికి తనవంతుగా సేవలు అందించారని కొనియాడారు. అలాంటి పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కెటిఆర్ అన్నారు. పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్ చేశామో ఇప్పుడూ అదే అడుగుతున్నట్లు చెప్పారు.
మరోవైపు పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బిజెపి నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ… దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో పీవీ సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టినట్లు చెప్పారు. పీవీని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని విమర్శించారు. పీవీకి సముచిత స్థానం ఇవ్వలేదని కెసిఆర్ చెబుతున్నారని, కానీ కనీసం ఆయన వర్ధంతి సభకు బిఆర్ఎస్ నుంచి ఎవరూ రాకపోవడం దారుణమన్నారు.