ఖమ్మం లోక్సభ నియోజకవర్గంపై కేటీఆర్ సమీక్ష
అసెంబ్లీ ఎన్నికలో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..నియోజకవర్గాలకు సంబంధించి నేతలతో సమీక్షా నిర్వహిస్తున్నారు. ఈరోజు తెలంగాణ భవన్ లో లోక్సభ నియోజకవర్గంపై సమీక్ష చేపట్టారు.
ఈ సమావేశంలో ఖమ్మం లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.